రామాయణ కల్పవృక్షం అవతారిక లో పద్యం
ఆ." భాస కాళిదాస భవభూతి దిజ్ఞాగులకు(బ్రశస్త వాగ్విలక్షణు(డు మురా
రిభట్టునకును రామకథా భాష్యకారులకును మోడ్పు కైఘటించి."
చూసుకుంటూ వస్తూంటే భాసుడు రచించినది ' ప్రతిమ ' ,' అభిషేకం ' నాటకాలు.వీటిని కేరళలో ప్రదర్శించే ' కొడియాట్టం ' ప్రక్రియలో వాడుతూ ఉండగా గుర్తించారట.ప్రతిమానాటకం తెలుగులో ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు అనువదించారనుకుంటాను.దశరథుడి మరణాన్ని మేనమామల ఇంటినుంచి తిరిగివచ్చే భరతుడు తమ పూర్వీకుల ప్రతిమలని నిలిపిన మందిరంలో తెలుసుకోవటం కథావస్తువు.దశరథుడి ప్రతిమ ని ఆసరికే అక్కడ ఉంచుతారు.భాసుడు కాళిదాసుకి ముందరివాడని తెలుస్తూ ఉంది.
కాళిదాసు రఘువంశమూ భవభూతి ఉత్తరరామచరిత్రా సుప్రసిద్ధాలే.భవభూతిదే ' మహావీరచరిత్ర ' పూర్వరామాయణం గురించి.
దిజ్ఞాగుడు ఒక బౌద్ధ పండితుడు.ఆయన రచన 'కుందమాల ' నాటకం.అంటే మొల్ల [ఒక జాతి మల్లె ]పూల దండ అని అర్థం అనుకుంటాను.సీతాపరిత్యాగం తర్వాత వాల్మీకి ఆశ్రమం చుట్టుపక్కల,అరణ్యంలో,నదీతీరంలో జరిగే కథ.సీత అల్లిన పూలదండ నదిలో తేలివస్తూ ఉంటే గ్రహించిన రాముడు గ్రహిస్తాడు అది ఆమె పనితనమని.ఇద్దరి కలయికతో సుఖాంతమవుతుంది కథ.
మురారిభట్టు రచించినదీ నాటకమే.' అనర్ఘరాఘవం '..దీన్ని కూడా కేరళ లో కొడియాట్టం ప్రదర్శనలలో ప్రయోగించేవారట.
[భారతదేశానికి ఈ చివర ఉన్న,మొదటిసారిగా విదేశీయులు కాలుపెట్టిన,క్రిస్టియానిటీ,ఇస్లాం ఈ దేశంలో మొదలయిన స్థలమయిన కేరళలో ప్రాచీనసంప్రదాయాలు నిలిచి ఉండటం ఆశ్చర్యమనిపిస్తుంది.'ఐతిహ్యమాల ' అనేది అక్కడి ప్రాచీనకథల సంకలనం.అందులో వరరుచి దగ్గరనుంచి,అగస్త్యుడి దగ్గరనుంచి ఎందరివో గాథలు ఉన్నాయి.తంత్రాలు,శాపాలు,జ్యోతిష్యం,యక్షులు,దేవాలయాలు...ఇంకా ఎన్ని విషయాలో.ఈ పుస్తకం రెండు సంపుటాలుగానూ,ఒక చిన్న సంగ్రహం గానూ కూడా ఇంగ్లీష్ లో దొరుకుతోంది.]
వాల్మీకి మహర్షికి తాను పరమభక్తుడయినా అవాల్మీకమయిన కల్పనలు చేసినవారిని కూడా స్మరించుకున్నారు విశ్వనాథ.ఆయన రామాయణమూ పూర్తిగా వాల్మీకి ని అనుసరించి ఉండదు.ఆయన ఉత్తరకాండ ని రచించలేదు కల్పవృక్షంలో.ఎందుకని?అది ప్రక్షిప్తమనే ఆయన భావించి ఉంటే తప్ప వదలివేసేవారు కారని నాకు అనిపిస్తుంది.అవునో కాదోగాని ఎంత న్యాయంగా,సుఖంగా ఉంది!
తెలిసినవారెవరయినా వివరిస్తే సంతోషిస్తాను.
ఆ." భాస కాళిదాస భవభూతి దిజ్ఞాగులకు(బ్రశస్త వాగ్విలక్షణు(డు మురా
రిభట్టునకును రామకథా భాష్యకారులకును మోడ్పు కైఘటించి."
చూసుకుంటూ వస్తూంటే భాసుడు రచించినది ' ప్రతిమ ' ,' అభిషేకం ' నాటకాలు.వీటిని కేరళలో ప్రదర్శించే ' కొడియాట్టం ' ప్రక్రియలో వాడుతూ ఉండగా గుర్తించారట.ప్రతిమానాటకం తెలుగులో ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు అనువదించారనుకుంటాను.దశరథుడి మరణాన్ని మేనమామల ఇంటినుంచి తిరిగివచ్చే భరతుడు తమ పూర్వీకుల ప్రతిమలని నిలిపిన మందిరంలో తెలుసుకోవటం కథావస్తువు.దశరథుడి ప్రతిమ ని ఆసరికే అక్కడ ఉంచుతారు.భాసుడు కాళిదాసుకి ముందరివాడని తెలుస్తూ ఉంది.
కాళిదాసు రఘువంశమూ భవభూతి ఉత్తరరామచరిత్రా సుప్రసిద్ధాలే.భవభూతిదే ' మహావీరచరిత్ర ' పూర్వరామాయణం గురించి.
దిజ్ఞాగుడు ఒక బౌద్ధ పండితుడు.ఆయన రచన 'కుందమాల ' నాటకం.అంటే మొల్ల [ఒక జాతి మల్లె ]పూల దండ అని అర్థం అనుకుంటాను.సీతాపరిత్యాగం తర్వాత వాల్మీకి ఆశ్రమం చుట్టుపక్కల,అరణ్యంలో,నదీతీరంలో జరిగే కథ.సీత అల్లిన పూలదండ నదిలో తేలివస్తూ ఉంటే గ్రహించిన రాముడు గ్రహిస్తాడు అది ఆమె పనితనమని.ఇద్దరి కలయికతో సుఖాంతమవుతుంది కథ.
మురారిభట్టు రచించినదీ నాటకమే.' అనర్ఘరాఘవం '..దీన్ని కూడా కేరళ లో కొడియాట్టం ప్రదర్శనలలో ప్రయోగించేవారట.
[భారతదేశానికి ఈ చివర ఉన్న,మొదటిసారిగా విదేశీయులు కాలుపెట్టిన,క్రిస్టియానిటీ,ఇస్లాం ఈ దేశంలో మొదలయిన స్థలమయిన కేరళలో ప్రాచీనసంప్రదాయాలు నిలిచి ఉండటం ఆశ్చర్యమనిపిస్తుంది.'ఐతిహ్యమాల ' అనేది అక్కడి ప్రాచీనకథల సంకలనం.అందులో వరరుచి దగ్గరనుంచి,అగస్త్యుడి దగ్గరనుంచి ఎందరివో గాథలు ఉన్నాయి.తంత్రాలు,శాపాలు,జ్యోతిష్యం,యక్షులు,దేవాలయాలు...ఇంకా ఎన్ని విషయాలో.ఈ పుస్తకం రెండు సంపుటాలుగానూ,ఒక చిన్న సంగ్రహం గానూ కూడా ఇంగ్లీష్ లో దొరుకుతోంది.]
వాల్మీకి మహర్షికి తాను పరమభక్తుడయినా అవాల్మీకమయిన కల్పనలు చేసినవారిని కూడా స్మరించుకున్నారు విశ్వనాథ.ఆయన రామాయణమూ పూర్తిగా వాల్మీకి ని అనుసరించి ఉండదు.ఆయన ఉత్తరకాండ ని రచించలేదు కల్పవృక్షంలో.ఎందుకని?అది ప్రక్షిప్తమనే ఆయన భావించి ఉంటే తప్ప వదలివేసేవారు కారని నాకు అనిపిస్తుంది.అవునో కాదోగాని ఎంత న్యాయంగా,సుఖంగా ఉంది!
తెలిసినవారెవరయినా వివరిస్తే సంతోషిస్తాను.
No comments:
Post a Comment