Tuesday 5 November 2013

దేవాదిదేవ

మైసూరు వాసుదేవాచారి గారు త్యాగరాజస్వామి ప్రశిష్యులైన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ [ బిలహరి లో పరిదానమిచ్చితే,షణ్ముఖప్రియలో మరివేరె దిక్కెవరయ్య రామా చేసినవారు ]గారికి శిష్యులు. మైసూరులోని మధ్వకుటుంబం లో జన్మించి తొంభై ఆరేళ్ల పరిపూర్ణ జీవితాన్ని పవిత్రంగా గడిపి రుక్మిణీదేవి గారి కళాక్షేత్ర లో బోధిస్తూ 1961 లో దివంగతులైనారు. వీరు వాగ్గేయకారులు. సంస్కృతం లోనూ, కన్నడం లోనూ రచనలు చేసినా మన అదృష్టం కొద్దీ ' సంగీతభాష ' అయిన తెలుగులో అనర్ఘరత్నాలవంటి కీర్తనలు చేశారు. తన తెలుగుభాషా జ్ఞానం 'త్యాగరాజ భిక్ష ' అని చెప్పుకొనేవారట
.'బ్రోచేవారేవరురా ' వాసుదేవాచారి గారు కరుణించిన సుధారసం.ఆ  ఆర్ద్రతనీ అచంచలవిశ్వాసాన్నీ వింటూనే ఉన్నాము వేర్వేరు కంఠాలలో. ..నావరకు నాకు ఇది ముగుస్తూనే మళ్లీ వినాలని అనిపించే కీర్తన.
సునాదవినోదిని లో చేసిన ' దేవాదిదేవ ' కి బాలమురళీకృష్ణ గారి గొంతులో ఎంతగా ప్రాణప్రతిష్ట జరిగిందంటే ఆ కీర్తన బాలమురళి గారి రచనే అని అనుకునేవారట. ఈ విషయం వాసుదేవాచారి గారికి చెప్తే ఆయన హాయిగా నవ్వేసి ' అవును, అది బాలమురళిదే ' అన్నారట. సునాదవినోదినిని ఏమాత్రం తటస్థంగా పాడినా విషాదం ధ్వనిస్తుంది. బాలమురళి గారు ఏ పాటనయినా చిరునగవు మోముతోనే పాడతారు కదా. ఈ కీర్తన ఆయన గొంతులో దేవాదిదేవుని దయ సిద్ధించిన చిదానందపూర్ణమైన ఉత్సవం లాగానే వినిపిస్తుంది.ఆ కీర్తన భావాన్ని బాలమురళి గారు వివరించిన వీడియో నీ, పాడిన వీడియోనీ షేర్ చేస్తున్నాను. వాసుదేవాచారి గారి పైన తీసిన తమిళ దాక్యుమెంటరీ లింక్ కూడా ఇస్తున్నాను.సబ్ టైటిల్స్ ఉన్నాయి
http://www.youtube.com/watch?v=l9bDUmPeOpM


http://www.youtube.com/watch?v=wEr-xk_HQ70

http://www.youtube.com/watch?v=VijICZhX2f0


Mysore Vasudevachariyar

No comments:

Post a Comment