Tuesday 5 November 2013

రాజ్యాధికారం

తెలుగు పద్యాలని చదివి అర్థం చేసుకోవటం అంతగా తెలియదు నాకు.బేతవోలు రామబ్రహ్మం గారు ప్రసిద్ధ పద్యాలని పరిచయం చేసి వ్యాఖ్యానించిన పుస్తకం దొరికితే తెచ్చుకున్నాను.అందులో ఒక కొత్త సంగతి తెలిసింది. సంస్కృత భారతంలో అంధుడయిన ధృతరాష్టృడికి రాజ్యార్హత లేదని పాండురాజుకి రాజ్యాభిషేకం చేసినట్లు ఉందనీ,నన్నయభట్టారకుల ఆంధ్రమహాభారతంలో జ్యేష్టుడయిన ధృతరాష్టృడిని రాజుగా అభిషేకించి ఆయన తరపున పాండురాజు రాజ్యం చెశాడని ఉందనీ. ఈ విషయాన్ని ఈ మధ్య విజయవాడ లలితా త్రిపుర సుందరీ పీఠం వారు ప్రచురించిన వ్యాసభారత వచనానువాదంలో చూసి రూఢి చేసుకున్నాను. సంస్కృత భారతం ప్రకారం కౌరవులది పూర్తి అధర్మం.తెలుగు భారతం ప్రకారం వారికే హక్కు ఉంటుందేమో.ధర్మరాజు జ్యేష్టుడు అనే వాదన తప్ప పాండవుల వైపు న్యాయం లేనట్లు కనిపిస్తుంది.పాండురాజు ఎన్ని దిగ్విజయాలు చేసినా అవి రాజప్రతినిధిగా చేసినవి మాత్రమే అవుతాయి.ఈ మార్పు నన్నయ్య గారు ఎందుకు చేసినట్లు?

No comments:

Post a Comment