సాంద్రమైన సాంబ్రాణి ధూపం ఆమె కంఠం. ఆ చిక్కని పొగలమధ్య
అడ్డాలలో బిడ్డలమయిపోతాము...అప్పటి ఆనందం అవ్యక్తం, ఇప్పటిది వ్యక్తమధురం,
చివరకు ఇంద్రియాతీతం. ఆ మధుకాంతి ఆమె రూపం కూడా, వృద్ధభార్గవి ఆమె.
సదాశివం గారు ఉన్నప్పుడూ వెళ్లిపోయాకా కూడా ఆమె మంగళగౌరీ
స్వరూపమే. సరస్వతీదేవి త్యాగరాజుల తపసుని మెచ్చుకొని దక్షిణభారతానికి
దిగివచ్చి ఒక పూర్ణ మానవజీవితం జీవించింది. దివ్యత్వానికీ ప్రత్యక్షానికీ
భేదం లేని ఆ కొన్ని కాల సుకృతాలలో ఆమె ఒకరు. చాల పెద్దమ్మ ఎం.ఎస్.
సుబ్బలక్ష్మి జన్మదినం నేడు[సెప్టెంబర్ 16] ఆమె తినిపించిన అన్నమయ్య గోరుముద్దలెంత కమ్మన....
No comments:
Post a Comment