' మహాశ్వేతల్లే ఉన్నావే మా తల్లీ ' అని
మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కృష్ణాతీరంలో చదివి ఎవరీవిడ? అనుకున్నాను.ఏ
పుస్తకంలో ఉందో మాత్రమే తెలిసింది.[ఇన్ని యేళ్లూ నన్ను వెంటాడుతూనే ఉంది
కథ రాసేవరకూ ] సంస్కృతం రాదు,ఇంగ్లీష్ అనువాదాలు అందుబాటులో లేవు. వేరే
తెలుగు కావ్యాలు చదువుకోవాలంటే పద్యాన్ని అర్థం చేసుకోవటం తెలియదు.
నా చదువుకునే చదువులో భాష ఒక భాగం కాదు. ఆశ మాత్రం ఉండేది. ఆ 80 ల లో
నాకు ఎవరు చెప్పారు? రెంటాల గోపాలకృష్ణ గారి కరుణ ప్రసరించింది
తేలికయిన,సమగ్రమయిన తెలుగు వచనం ద్వారా. ఆ పుస్తకాలలో కొన్ని ఇప్పుడు
కినిగె లో దొరుకుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది.http://kinige.com/kbook.php?id=1867&name=kadambari
No comments:
Post a Comment