తాను నిర్ణయించుకున్న భౌతికమయిన పరిధిలో జీవిస్తూనే
అందుకోగల సౌందర్యసర్వస్వాన్నంతా తనలోనూ చుట్టూనూ నిలుపుకోవటం సాధ్యమేనని
సంజీవదేవ్ గారి వలన తెలుసుకోగలిగాను.భావుకుడూ కళాకారుడూ అయినంత మాత్రాన
పర్వర్ట్ కానక్కర్లేదని కూడా. ఆయన ' తుమ్మపూడి ' నుంచి కొన్ని వాక్యాలు
..ఆయన హిమాలయాలలో రోరిక్ ల ఇంట గడిపినప్పటి రోజులలోవి. ' వెన్నెల తెల్లగా
ప్రకాశించసాగింది.కిటికీలో గుండా ఈస్టర్ లిల్లీ ల మీద వెన్నెల పడి
వెన్నెల కంటె తెల్లగా వెలుగుతున్నాయి అవి.వాటి సుగంధమాధురి కూడా
ప్రసరిస్తోంది బాగా.మళ్లీ వెళ్లి కిటికీలో కూర్చున్నాను నేను.సంపూర్ణమైన
ఆనంద వాతావరణం.తెల్లని వెన్నెల,మధుర సుగంధం ,ఈ రెండూ మిళితమై అద్వైత రూపం
దాల్చినాయి.ఆకాశంలోని చంద్రుని నుంచి ఈ సుగంధం వస్తున్నట్టు,క్రింద ఈస్టర్
లిల్లీ ల నుంచి ఈ వెన్నెల ప్రసరిస్తూన్నట్టు తట్టసాగింది.వెన్నెలకు
సువాసన ఉన్నదని,సువాసనలో వెన్నెల ఉన్నదని భావిస్తూ మంచం మీద పడుకొని కళ్లు
మూశాను .'
No comments:
Post a Comment